byసూర్య | Thu, Mar 28, 2024, 04:26 PM
జాతీయ ఉపాధిహామీలో పని చేస్తున్న కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివలింగం, హనుమంతురావు డిమాండ్ చేశారు.
గురువారం సత్తుపల్లిలోని నీలం రామచంద్రయ్య భవనంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు బిల్లులు చెల్లించటం లేదన్నారు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.