byసూర్య | Thu, Mar 28, 2024, 04:25 PM
రాష్ట్రంలో రోజురోజుకు భ్రూణహత్యలు జరుగుతున్నాయని పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ శిరోమణి అన్నారు. గురువారం సత్తుపల్లిలోని నీలం రామచంద్రయ్య భవనంలో జిల్లా అధ్యక్షురాలు గోకినేపల్లి లలిత అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
భ్రూణహత్యలు నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. భ్రూణహత్యలు చేయిస్తున్న, చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.