byసూర్య | Thu, Mar 28, 2024, 04:01 PM
మిత్ర పథకం ద్వారా అందించే ఇంటి నిర్మాణం, విద్యా రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కె. వంశీధర్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట సింగిల్ విండో కార్యాలయంలో మహాజన సభ సమావేశంలో మాట్లాడుతూ. సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి పిఎసిఎస్ అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రతి ఏడాది రైతులకు సాగుకు ఇబ్బంది లేకుండా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.