byసూర్య | Thu, Mar 28, 2024, 03:57 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ఖాయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. 100 రోజులలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేశారని అన్నారు.