byసూర్య | Thu, Mar 28, 2024, 03:53 PM
వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంతో పాటు చింతకుంట, మాందాపూర్, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, గోప్లాపూర్, రేమొద్దుల గ్రామాల రైస్ మిల్లులను గురువారం తాసిల్దార్ సుభాష్ నాయుడు, డిటి అశోక్, ఆర్ఎ మహేష్ లు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఉన్న మిల్లులు వినియోగంలో ఉన్నాయా లేవా? మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని అనుగుణంగా సిఎంఆర్ బియ్యం నిర్దేశించిన ప్రకారం సరఫరా చేయాలని మిల్లర్లకు సూచించారు.