byసూర్య | Thu, Mar 28, 2024, 03:51 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు ఎంపీడీఓ రవీంద్ర సూచించారు. గురువారం అయ్యవారిపల్లి గ్రామసమీపంలో గల చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీఓ పరిశీలించారు. మండలంలో 1728 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించి కూలీల సంఖ్య పెంచాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు.