byసూర్య | Thu, Mar 28, 2024, 03:49 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు బృందం విచారిస్తోంది. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.