byసూర్య | Thu, Mar 28, 2024, 03:44 PM
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పురస్కరించుకుని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆవరణలో ఉన్న ఎంపీపీ కార్యాలయంలో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గడచిన పది సంవత్సరాలుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఎన్నికలతో స్వేచ్ఛగా ఓటు వేస్తారని అన్నారు.