byసూర్య | Thu, Mar 28, 2024, 03:12 PM
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ కట్టమైసమ్మ తల్లి, సుబ్రహ్మణ్యస్వామి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు కుటుంబ సమేతంగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వేద మంత్రాలతో ఆశీర్వదించి, శాలువాలతో సత్కరించి అమ్మవారి ప్రతిమను బహూకరించారు.