byసూర్య | Thu, Mar 28, 2024, 01:22 PM
రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలని రైతులు తీర్మానించారు. బుధవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామ సింగిల్ విండో మహాజనసభ గ్రామ రైతు వేదికలో సొసైటీ అధ్యక్షులు వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాజన సభలో పలు తీర్మానాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రైతులు కోరారు. ఇటీవల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.