byసూర్య | Thu, Mar 28, 2024, 01:20 PM
దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని గ్రామస్తులు, బిజెపి నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్ కి సమాచారం అందించడంతో స్పందించిన ఆయన ఎమ్మెల్యే నిధుల నుండి బోరును బుధవారం తవ్వించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, అనుపాటి రవీందర్ రెడ్డి, తిప్పాపురం రవి, గ్రామ అధ్యక్షులు రవి, సత్యనారాయణ, లక్ష్మణ్, నీలంరెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.