byసూర్య | Thu, Mar 28, 2024, 01:31 PM
భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులో అక్రమ మొరం తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూపాల్ తాసిల్దార్ శివప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ఎర్రకుంటలో అర్ధరాత్రి అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మొరం తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.