byసూర్య | Sat, Mar 02, 2024, 10:51 AM
2024 25 సంవత్సరానికి బోయిన్ పల్లి లోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదవ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు బాలురు 10 , బాలికలకు 10 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు బోనాఫైడ్ తో ఈనెల 4వ తేదీ లోపు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.