byసూర్య | Sat, Mar 02, 2024, 11:23 AM
తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత RTC బస్సు ప్రయాణంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. మహిళలు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, త్వరలో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. RTC డ్రైవర్స్ ఇబ్బందుల గురించి కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.