byసూర్య | Sat, Mar 02, 2024, 10:45 AM
శంకరపట్నం మండలం కొత్తగట్టు పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి డాక్టర్ మాధవరావు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలను వేశారు. 148 పశువులకు శుక్రవారం ఈవ్యాధి నివారణకు ఉచిత టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాడి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర మొండయ్య, పశు వైద్య సిబ్బంది హైమద్, అమీర్ ఖాన్, ఆరిఫ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.