byసూర్య | Fri, Mar 01, 2024, 04:11 PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కిసాన్ సెల్ నాయకులు సైనికుల్లా కష్టపడ్డారని, నామినేటెడ్ పోస్టుల్లో కిసాన్ కాంగ్రెస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ అన్నారు.
సత్తుపల్లి, కల్లూరులో జరిగిన సమావేశాల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకి చెందిన వారికే ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితులు దుర్భరంగా మారాయన్నారు.