byసూర్య | Fri, Mar 01, 2024, 04:09 PM
వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జెండాపాట కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.
వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినా కూడా రైతులు శాంతించలేదు. కేవలం రూ. 14నుంచి 16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.