byసూర్య | Fri, Mar 01, 2024, 04:08 PM
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సీతారాంపురం గ్రామంలో కట్టకూర్ నుండి సీతారాంపురం వరకు రూ. 220. 00 లక్షలతో నిర్మించనున్న నూతన బి.టి రోడ్డుకు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇక నుంచి అభివృధ్ది పనులు సాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.