byసూర్య | Fri, Mar 01, 2024, 03:23 PM
తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం పాత కమిటీని రద్దు చేసి నూతనంగా ఎన్నికలు నిర్వహించాలని ఆ సంఘం జిల్లా ఇన్ చార్జ్ అధ్యక్షుడు బోయినపల్లి రామారావు గౌడ్ డిమాండ్ చేశారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అధ్యక్షుడు తన ఉద్యోగ బాధ్యతల నుంచి సస్పెండ్ అయినా సంఘ సభ్యులకు తెలియకుండా అధ్యక్షుడిగా కొనసాగారన్నారు. అధ్యక్షుడిని తొలగించాలని తీర్మానాలు చేసి రాష్ట్ర కమిటీకి పంపినట్లు తెలిపారు.