byసూర్య | Fri, Mar 01, 2024, 03:21 PM
ఖమ్మంలో ఈ నెల 3, 4, 5న నిర్వహించే సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ యూనిటీ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వేంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
మూడు విప్లవ పార్టీలు ఐక్యం కానున్న సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యాలయాన్ని పార్టీ జెండాలు, తోరణాలతో నాయకులు ముస్తాబు చేశారు. కార్మిక విప్లవ పార్టీల ఐక్యత చారిత్రక అవసరమని తెలిపారు.