byసూర్య | Fri, Mar 01, 2024, 03:20 PM
మార్చి 1 నుంచి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న 'గృహజ్యోతి' అర్హత పొందిన విద్యుత్ వినియోగదారులకు పథకం అమలులోకి వస్తుందని శుక్రవారం ఎన్పీడీసీఎల్ ఖమ్మం జిల్లా ఎస్ఈ సురేందర్ తెలిపారు.
అర్హత ఉండి ఇప్పటివరకు 'గృహజ్యోతి' ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు చేయని వారికి ఇంకా అవకాశం ఉందన్నారు. అర్హులు సంబంధిత ఎంపీడీవో, పురపాలక, నగరపాలక సంస్థ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేయాలని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.