byసూర్య | Fri, Mar 01, 2024, 12:18 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్ కార్డుతో ప్రభుత్వ పాలనకు దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. అయితే.. హైదరాబాద్ నగరంలో జీరో కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. రేషన్ కార్డును విద్యుత్ బిల్లులతో అనుసంధానం చేసిన వినియోగదారులకు అధికారులు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉన్న వారందరికీ మార్చి నెలకు జీరో బిల్లు వస్తుంది.
ఈ మేరకు ఇప్పటికే విద్యుత్ అధికారులు బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ మిషన్లు కూడా కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించామని తెలిపారు. పరీక్షల కోసం జీరో బిల్లులు జారీ చేయబడ్డాయి. అంతా బాగానే ఉందని.. నగరంలో జీరో బిల్లులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి అన్ని శాఖల్లో ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.ఫిబ్రవరి నెలకు సంబంధించిన అకౌంట్లను క్లోజ్ చేసి మార్చి వివరాలను బిల్లింగ్ మిషన్లలో లోడ్ చేయాలని తెలిపారు.