byసూర్య | Fri, Mar 01, 2024, 12:15 PM
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి శుక్రవారం స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి సుప్రభాత సేవ, సుదర్శన హోమం నిర్వహించి, 108 కళాశాలకు ప్రత్యేక పూజలు చేసి, ప్రధాన కలశంతో స్వామివారి గర్భాలయం ప్రదక్షణ చేశారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని అభిషేకించారు. ఆలయ అధికారులు, భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు.