byసూర్య | Sat, Dec 09, 2023, 01:27 PM
మాజీ సీఎం కేసీఆర్కు సోమాజిగూడ యశోద వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతం చేశారు. దాదాపు 3 గంటలకు పైగా సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో, అతన్ని సాధారణ గదికి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది.
శనివారం ఉదయం వాకింగ్ స్టాండ్ సాయంతో వైద్యబృందం కేసీఆర్ ను నడిపించింది. కేసీఆర్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.