అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరికలు !

byసూర్య | Sat, Dec 09, 2023, 01:22 PM

సంగారెడ్డి నియోజకవర్గ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. తన మాట వినాలనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ అధికారులు నా సూచనలను పాటించాలని కోరారు. 
ఇక నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి నా సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని ఆహ్వానిస్తానని వెల్లడించారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేసేవారు. అయినా హుందాగా ప్రవర్తించాను. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలకు నా తరపున నా సతీమణి నిర్మల హాజరవుతారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


Latest News
 

400 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ ఇచ్చిన మాట.. 30 ఏళ్లుగా హైదరాబాదీల ఇబ్బందులు Fri, Sep 20, 2024, 08:13 PM
ఓటుకు నోటు కేసు,,,,సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట Fri, Sep 20, 2024, 08:11 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ Fri, Sep 20, 2024, 07:59 PM
హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM