byసూర్య | Sat, Dec 09, 2023, 01:22 PM
సంగారెడ్డి నియోజకవర్గ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. తన మాట వినాలనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ అధికారులు నా సూచనలను పాటించాలని కోరారు.
ఇక నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి నా సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని ఆహ్వానిస్తానని వెల్లడించారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేసేవారు. అయినా హుందాగా ప్రవర్తించాను. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలకు నా తరపున నా సతీమణి నిర్మల హాజరవుతారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.