byసూర్య | Sat, Dec 09, 2023, 01:19 PM
తెలంగాణ రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించింది.
తెలంగాణ రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఉచిత ప్రయాణ టికెట్, ఛార్జీ రూ.00.00' అని దానిపై రాసి ఉంది.