ఓటుకు నోటు కేసు,,,,సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట

byసూర్య | Fri, Sep 20, 2024, 08:11 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్ధనను నిరాకరించింది. కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ద్విసభ్య ధర్మాసనం.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదనను తిరస్కరించింది. ఒకవేళ, కేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నట్టయితే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.


అలాగే,, ముఖ్యమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఏసీబీ అధికారులు దర్యాప్తు వివరాలను సీఎం, హోమ్ మంత్రికి నివేదించరాదని ఆదేశించింది. కాగా, 2015లో తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మె్ల్సీ ఎన్నికల సందర్భగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నించారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి కాల్ రికార్డింగ్స్ అంటూ ఓ ఆడియో అప్పట్లో బయటకు వచ్చింది.


అలాగే, స్టీఫెన్‌సన్‌ నివాసంలో నగదుతో కూడిన బ్యాగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయిన వీడియో ఫుటేజ్ సంచలనం సృష్టించింది. ఆ కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై బయటకొచ్చారు. కాగా, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌‌కు మార్చాలని సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ వేరు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సహా రేవంత్ రెడ్డి, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా, శుక్రవారం నాటి విచారణలో బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇంతటితో ఈ పిటిషన్‌పై విచారణ ముగిసిందని పిటిషనర్‌కు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది.


Latest News
 

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM
నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌తో ఇవే ప్రధాన ఎజెండా Fri, Sep 20, 2024, 08:15 PM