byసూర్య | Thu, Dec 07, 2023, 11:35 AM
ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన బిఎస్సి రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 'ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నా. దయచేసి ప్రగతిభవన్ ముందున్న ముళ్ల కంచెను తీసేసి ప్రజలకు చేరువ చేయగలరు. టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేయాలని కోరుతున్నా. ధరణిని రద్దు చేసి అక్రమంగా లాక్కున్న భూములను ప్రజలకు పంచాలి' అని ట్వీట్ చేశారు.
HYDలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపనున్నారు. కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంత్రి మండలిని కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రులుగా ఎంపికైన ఎమ్మెల్యేలకు సీఎల్పీ లీడర్ రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు. వీరంతా రేవంత్ రెడ్డితో పాటు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.