ఓయూ నుంచి అసెంబ్లీకి స్టూడెంట్ లీడర్,,,,చొప్పదండి నుంచి గెలుపొందిన మేడిపల్లి సత్యం

byసూర్య | Wed, Dec 06, 2023, 08:38 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలా మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అన్ని రంగాలకు చెందిన వారు అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు ఓటమి చవి చూశారు. విద్యార్థి సంఘాల్లో చురుగ్గా ఉంటూ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంటుంది.


తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సంఘాల పాత్ర కీలకం. స్టూడెంట్ లీడర్లు ఉద్యమంలో యాక్టివ్‌గా పని చేసి రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు కూడా పెట్టారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా పని చేసిన బాల్క సుమన్, గాదరి కిషోర్ ఆ కోవలోకే వస్తారు. ఈ ఎన్నికల్లోనూ వారు పోటీ చేసినా.. గెలుపు తలుపు తట్టలేకపోయారు. అయితే ఈసారి ఓయూ నుంచి మరో స్టూడెంట్ లీటర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చొప్పదండి నియోవజర్గం నుంచి పోటీ చేసిన మేడిపల్లి సత్యం ఎన్నికల్లో విజయం సాధించారు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మేడిపల్లి సత్యం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ విభాగంలో తన MA PhD పూర్తి చేశారు. చిన్నతనం నుంచి సేవా భావం కలిగిన మేడిపల్లి సత్యం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘాలలో చురుగ్గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంద విద్యార్థి విభాగంలో పని చేశారు. ఓయూ వేదికగా తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం పోరాటం సాగించారు. అనంతరం 2018లో చొప్పదండి శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి కొంతకాలం కొనసాగినప్పటికీ అది నచ్చక మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చొప్పదండి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసిన సత్యం విజయ దుందుభి మోగించారు.


కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఓయూ నుంచి బాల్క సుమన్, కిషోర్ మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టగా.. తాజాగా మేడిపల్లి సత్యం కూడా అసెంబ్లీలో అధ్యక్షా అనబోతున్నారు. గతంలో పిడమర్తి రవి, బల్మూరి వెంకట్ వంటి విద్యార్థి నేతలు అసెంబ్లీ బరిలో నిలిచినా.. విజయం వరించలేదు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM