byసూర్య | Wed, Dec 06, 2023, 02:30 PM
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంటరానితనం రూపుమాపడానికి అంబేద్కర్ కృషి చేశారని కొనియాడారు. జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, సాయిలు, సంతోష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.