byసూర్య | Tue, Dec 05, 2023, 10:16 AM
నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను హనుమకొండ జిల్లా సీఎంవో, ఐఈసీఓ రాధా సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి అభినందించారు. పాఠశాల చాలా పరిశుభ్రంగా ఉందని, విద్యార్థులు క్రమశిక్షణగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు విషయాల గురించి సూచనలు సలహాలు చేశారు.