byసూర్య | Tue, Dec 05, 2023, 09:31 AM
వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎంవీ రామన్ పాఠశాలలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. యం. వి. రామన్ విద్యా సంస్థ ఛైర్మన్ మాజీ ఎంపీపీ ఎం. శ్రీధర్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 62 మంది పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు రక్తదానం చేశారు. పాఠశాల ప్రాంగణంలో ఉదయం 10: 00 గంటల నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.