byసూర్య | Tue, Dec 05, 2023, 09:29 AM
తాగిన మైకంలో పురుగుల మందు త్రాగి చిరువ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైనూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సందీపకుమార్ వివరాల ప్రకారం. మండలంలోని బాలాజీనగర్ కు చెందిన గాయక్వాడ్ మారుతి సోమవారం రాత్రి కొడుకుతో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. దీంతో భావోద్వేగానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఊజ్వల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.