byసూర్య | Tue, Dec 05, 2023, 09:24 AM
మిచౌoగ్ తుఫాను దృష్ట్యా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం నుంచి రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన ఉందన్నారు. మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. హాస్టల్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు రాకూడదు. హాస్టళ్లలోనే వుండాలన్నారు. కావున సహాయానికి జిల్లా కంట్రోల్ రూం 1077, 9063211298 ని సంప్రదించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.