byసూర్య | Tue, Dec 05, 2023, 09:20 AM
వాతావరణశాఖ ఆదేశాల మేరకు మూడు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంచాయతీ కార్యదర్శులు అందరూ అందుబాటు లోనే ఉండాలని కారేపల్లి ఎంపీడీవో ఎం. చంద్ర శేఖర్ మంగళవారం ఆదేశించారు. ప్రజలు ఎవరు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని తెలియజేస్తూ దేవాలయాల ద్వారా, గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా విసృత ప్రచారం చేయాలని ఆయన కోరారు.