byసూర్య | Tue, Dec 05, 2023, 09:19 AM
తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషించే విధంగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, ఖమ్మం జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్రస్టీరింగ్ కమిటీచైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు తెలిపారు. సోమవారం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. మెజారిటీ ఇచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు, జిల్లా ప్రజలకు అభినందనలు తెలిపారు.