byసూర్య | Tue, Dec 05, 2023, 09:16 AM
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రక్రియ కారణంగా ఖమ్మం నగరపాలకసంస్థతో పాటు రెవెన్యూ కార్యాలయాల్లో ఆగిపోయిన పౌరసేవలను పునరుద్ధరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ఆయా కార్యాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో పౌరసేవలు నిలిచిపోయాయి. సుమారు నెలరోజులుగా ఎటువంటి పౌరసేవలు ప్రజలకు అందలేదు. కాగా, ఎన్నికలు ముగియడంతో ఇక సౌరసేవలు ప్రజలకు అందనున్నాయి.