byసూర్య | Sat, Dec 02, 2023, 03:43 PM
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలంలోని ఓటర్ల తీర్పు ఆసక్తిగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 3, 22, 996 ఓటర్లలో రఘునాథపాలెం మండలంలో 54 పోలింగ్ కేంద్రాల్లో 39, 822 మంది ఓటర్లు ఉన్నారు.
అయితే ప్రతి ఎన్నికల్లో కూడా రఘునాథపాలెం మండలంలో మేజార్టీ వచ్చిన అభ్యర్థులు గెలుపొందటంతో తక్కువ ఓటర్లు ఉన్నా ఎక్కువ అసక్తిగా రఘునాథపాలెం మండలం ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో రఘునాథపాలెం ఓటరు తీర్పు ఎలా ఉంటుందోననే ఆసక్తి పెరిగింది.