byసూర్య | Sat, Dec 02, 2023, 03:39 PM
జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల శాసనసభ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్నది. దీనికి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి వేరువేరుగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో పూర్తవుతుంది. 18 రౌండ్లలో 14 చొప్పున పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరగనుండగా 19వ రౌండ్లో 2 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.కోరుట్ల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో జరగనుండగా 18 రౌండ్లలో 14 పోలింగ్ కేంద్రాల చొప్పున, 19 రౌండ్లలో 10 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ధర్మపురి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 20 రౌండ్లలో జరుగుతుంది. 19 రౌండ్లలో 14 పోలింగ్ కేంద్రాల చొప్పున 20 రౌండ్లలో 3 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.