byసూర్య | Sat, Dec 02, 2023, 03:38 PM
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. నగరంలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి 14 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తుకు సిద్ధం అయ్యారు. రేపు హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్యా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెంచారు.