byసూర్య | Sat, Dec 02, 2023, 12:26 PM
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో శనివారం అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆదివారం రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.