byసూర్య | Sat, Dec 02, 2023, 12:06 PM
తెలంగాణలో కాంగ్రెస్కు 63-73, బీఆర్ఎస్కు 34-44 సీట్లు వస్తాయని India Today Axis My India ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. 2018లో India Today వెల్లడించిన సర్వేను పరిశీలిస్తే.. బీఆర్ఎస్కు 79-91 సీట్లొస్తాయని అంచనా వేయగా, 88 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 21-33 సీట్లు వస్తాయని చెప్పగా, 21 సీట్లు వచ్చాయి. మరి ఈసారి కూడా ఇండియా టుడే వెల్లడించిన.. ఫలితం పక్కాగా వస్తుందా? అనేది రేపు తేలనుంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.