byసూర్య | Sat, Dec 02, 2023, 10:37 AM
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసి, ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక రేపు ఉదయం 08:00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే పందేల జోరు ఊపందుకుంది. రూ.1000 నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ వేస్తున్నారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే దావత్ చేస్తాం.. టూర్కు తీసుకెళ్తామంటూ పందేలు కాస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా.. ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అసలు ఎగ్జిట్ పోల్స్లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్ సర్వే సంస్థలు మాత్రం.. కేవలం ఒక్క శాతం, రెండు శాతం ఓటర్ల అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా?