byసూర్య | Fri, Dec 01, 2023, 05:09 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చీ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చీ ధర రూ. 24, 400 జెండా పాట పలకగా, కొత్త మిర్చీ ధర రూ. 22, 500 జెండాపాట పలికింది.
క్వింటా పాత పత్తి ధర రూ. 6, 600, కొత్త పత్తి ధర రూ. 6, 700 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చీ ధర రూ. 100, పాత పత్తి ధర రూ. 50, కొత్త పత్తి ధర రూ. 50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు.