మూసీ పునరుజ్జీవ పనులను కేసీఆర్ ఎప్పుడో ప్రారంభించారన్న కేటీఆర్

byసూర్య | Sun, Oct 27, 2024, 03:34 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన నాచారంలోని ఎస్టీపీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నిర్మించిన ఎస్టీపీల వల్ల మురుగు నీటి శుద్ధి జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో మురుగు నీటి శుద్ధికి రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తమ హయాంలో నిర్మించిన ఎస్టీపీలను రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు.కేసీఆర్ మూసీ పునరుజ్జీవ పనులు ఎప్పుడో ప్రారంభించారని, ఇప్పుడు కొత్తగా వచ్చి చేయాల్సిందేమీ లేదని విమర్శించారు. ఏ పథకం, అభివృద్ధి పనికి డబ్బులు లేవని మంత్రులు చెబుతున్నారని, మరి మూసీ పునరుజ్జీవానికి ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ఎవరి కోసమని ప్రశ్నించారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని... ఆ పేరుతో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM