వ్యర్థాలను తొలగించే బాధ్యత బిల్డర్లదేనన్న హైడ్రా కమిషనర్

byసూర్య | Sun, Oct 27, 2024, 03:35 PM

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టతనిచ్చారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను హైడ్రా కూల్చివేయదని హామీ ఇచ్చారు. సర్వే నెంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది ఉంటే కనుక చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. తప్పుడు అనుమతులతో చెరువులు, నాలాలను ఆక్రమించిన నిర్మాణాలు కూల్చుతామని వెల్లడించారు. హైడ్రా వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు.హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చుతుందని, ఆ తర్వాత వ్యర్థాలను తొలగించే బాధ్యత బిల్డర్లదే అన్నారు. వ్యర్థాలను తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలువైన వస్తువులను తీసుకెళ్లి... మిగతా వ్యర్థాలను వదిలేస్తే హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అలా కాని పరిస్థితుల్లో వ్యర్థాలను హైడ్రా తొలగిస్తే అందుకయ్యే ఖర్చును నిర్మాణదారుడి నుంచి వసూలు చేస్తామన్నారు.


Latest News
 

కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ Sun, Oct 27, 2024, 05:31 PM
పర్యాటకుల శుభవార్త.. పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై సాగర్ టూ శ్రీశైలం థ్రిల్లింగ్ ప్రయాణం Sun, Oct 27, 2024, 04:42 PM
హైదరాబాద్ లో తొలి డబుల్‌ డెక్కర్, ఎలివేటెడ్‌ కారిడార్లు.. నిర్మాణంపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం Sun, Oct 27, 2024, 04:41 PM
జన్వాడ ఫాంహౌస్‌లో అర్ధరాత్రి పార్టీ.. పోలీసుల మెరుపు దాడి, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ Sun, Oct 27, 2024, 04:39 PM
ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు.. డిసెంబర్ చివరి నాటికి, మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు Sun, Oct 27, 2024, 04:38 PM