byసూర్య | Fri, Dec 01, 2023, 05:07 PM
బల్మూరు మండల కేంద్రంలో 169 పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్లో ఓటు వేస్తున్న ఓటరుతో ఎలా వేస్తున్నావ్ అంటూ ప్రశ్నించడం ఏమిటని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీ శారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాదోప వాదాలు జరిగాయి.
సంబంధిత ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఓటు వేసే చోటికి వెళ్లి ఓటర్తో ఇలా వేయాలని చెప్పి ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. తోపులాట జరగడంతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు గువ్వల బాలరాజుకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.