byసూర్య | Fri, Dec 01, 2023, 05:01 PM
ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టడం, వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా ప్రతీ నెల 40కి పైగా హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయి. గతేడాది జిల్లాలో 16, 307 బాధితులు ఉండగా ప్రస్తుతం 16, 616 మంది ఉన్నారు. వీరిలో 6, 576 మంది ప్రతీ నెల మందులు వాడుతున్నారు. వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు అడిషనల్ డీఎంహెచ్వో ఎల్. ప్రవీణ తెలిపారు.