గతరాత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసులు దాడులు

byసూర్య | Sun, Oct 27, 2024, 07:48 PM

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. తాజాగా, రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. అసలేం జరిగిందంటే... రాయదుర్గంలోని రాజ్ పాకాలకు చెందిన విల్లాలో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. రాజ్ పాకాల విల్లాకు తాళం వేసి ఉండడంతో ఎక్సైజ్ సిబ్బంది వేచి చూశారు. అక్కడికి దగ్గర్లోనే మరో విల్లాలో రాజ్ పాకాల ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దాంతో వారు ఆ విల్లాలో తనిఖీ చేసేందుకు యత్నించారు. తనిఖీలకు యత్నించిన ఎక్సైజ్ శాఖ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేపడతారని బీఆర్ఎస్ నేతలు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM