byసూర్య | Fri, Dec 01, 2023, 05:12 PM
కారేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో వైద్యులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యులు డాక్టర్ బి. సురేష్ , శ్రేష్ట సాఫల్య పాల్గొని మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.